ఏలూరు : జంగారెడ్డి గూడెంలో డ్వాక్రా సంఘాలతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. భేటీ డ్వాక్రా సంఘాల మహిళలతో మాట్లాడిన పవన్ రాష్ట్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. టీడీపీ, వైకాపాలు నేరగా అధికారంలోకి రావని పవన్ పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు జనసేనాని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 2019లో కొత్త సమీకరణాలతో అధికారం సిద్ధిస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ బెదిరింపులకు భయపడబోమని, అంతా కష్టంతో కూడుకున్నదేనని హితవు పలికారు.