లక్నో : రైతుల రుణమాఫీ అమలు, విద్యుత్ టారిఫ్ తగ్గించడం, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలనే డిమాండ్లతో ఢిల్లి ముట్టడికి బయలుదేరిన రైతులను యుపిలో పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 70 వేల మంది రైతులు హరిద్వార్నుంచి పాదయాత్రగా ఢిల్లికి బయలుదేరారు. జాతీయ రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులను బుజ్జగించేందుకు ఉత్తర్ ప్రదేశ్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రుల మాటలను రైతులు విశ్వసించడం లేదు. ఢిల్లివైపు తమ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.