అమరావతి : కేంద్రం ఏపీకి చేసిన అన్యాయంపై తాడేపల్లి గూడెంలో ఈ నెల 29న ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన అభివృద్ధి ఆకాంక్ష ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది అయితే విపక్ష నేత జగన్ ది అధికార, అవినీతి కాంక్ష అన్నారు. జగన్ పాదయాత్ర కేవలం చంద్రబాబును విమర్శించడానికే చేస్తున్నారని దుయ్యబట్టారు.