ఏలూరు : జనసేనాని పవన్ కల్యాణ్ కొల్లేరు నిర్వాసితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్లేరు నిర్వాసితులు తమ సమస్యలను జనసేనానికి ఏకరువు పెట్టారు. కాలుష్యం కారణంగా తాగునీటికి కూడా నోచుకోని పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకి మృతదేహాలను పూడ్చేందుకు కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నామన్నారు.