నాగాయలంక : కృష్ణాజిల్లా నాగాయలంక మండల కేంద్రమైన నాగాయలంకలో స్థానిక మారుతి విద్యానికేతన్ పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని ప్రముఖ ఆక్వా రంగానికి చెందిన వ్యాపారవేత్త కొక్కిలిగడ్డ మీరాసాహేబ్ ఆర్థిక సౌజన్యంతో మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మీరాసాహెబ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లిఖిత రోగులను పరీక్షలు చేసి శస్త్ర చికిత్సలకు ఎంపికైన వారిని తమ వాహనం లొ ఉచితంగా తీసుకు వెళ్ళి చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు ఈ శిబిరం ప్రారంభం కాగానె వందలాది మంది రోగులు బారులు తీరి తమ పేరులు నమోదు చెయించుకుని పరిక్షలు చెయించుకున్నారు. ఈ సందర్భంగా మీరాసాహెబ్ మాట్లాడుతూ రోగులు సమన్వయంతో పరీక్షలు చేయించు కోవాలని కోరారు. ఈ శిబిరాన్ని మానవత సేవా సంస్థ ప్రతినిధులు తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ, రేమాల శేషుబాబు తదితరులు పర్యవేక్షించారు.