అమరావతి: ఆయుష్మాన్ భారత్ పథకం చారిత్రాత్మకమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంతో 50 కోట్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏపీ సర్కార్ రూ.2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రతి స్కీమ్ను స్కాంగా మార్చేశారని ఆరోపించారు. నీరు-చెట్టు కార్యక్రమంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. కేంద్రం సహకరించలేదనడం దుష్ప్రచారమేనన్నారు.