అమరావతి : ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్రం వైఖరిని నిరసిస్తూ సిపిఐ విద్రోహ దినాన్ని పాటిస్తోంది. కర్నూలు, తిరుపతి, విజయవాడ, అనంతపురం జిల్లాల్లో వామపక్షాలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చాలని, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.