అమరావతి: అలగడానికి పార్లమెంట్కు వెళ్లకపోవడానికి సంబంధం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజకీయ వాతావరణం బాగాలేదని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. దేశంలో ఎవరి మీద అలిగినా ప్రయోజనం ఉండదన్నారు. రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఇప్పుడు కబుర్లు చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.