గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్ ఐటీకి చిరునామాగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుంటూరులో ఎస్ఆర్ఎం వర్సిటీలో ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు-భవిష్యత్ నైపుణ్యాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాంకేతికత సమాజానికి ఉపయోగపడాలన్నారు. ఐటీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా వస్తున్న ఉపాధి అవకాశాలను ఇంజనీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు.