అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులుపల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీనొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు మృతిచెందగా. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కోడుమూరు మండలం కల్లపాడు గ్రామస్థులు. ఆటోలో మహానందికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.