తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో మొత్తం 31 కంపార్ట్ మెంట్లూ నిండిపోయాయి. స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలగడానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.