వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. 7వ విడత అసెంబ్లిd ఎన్నికల ప్రచారంలో భాగంగా తన లోక్సభ నియోజకవర్గమైన వారణాసిలో మోడీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ముందుగా బనారస్ హిందూ యూనివర్శిటీలో ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు. పండిత్ మదన్ మోహన్ మాల్వియ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాసేపట్లో జౌన్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.