బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పుజారా.. లియాన్ బౌలింగ్లో హ్యాండ్స్కోంబ్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 61 పరుగుల రెండవికెట్భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరో ఎండ్లో ఓపెనర్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నాడు. మంచి బంతులను గౌరవిస్తూనే, చెత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ను ఆసీస్ బౌలర్లు దెబ్బతీశారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ ముకుంద్ వికెట్ తీసిన ఆసీస్ బౌలర్లు భారత్కు హెచ్చరికలు పంపారు. కానీ పుజారా-రాహుల్ జోడి ఆదుకుంది. లంచ్ విరామ సమయానికి భారత్ 27.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. రాహుల్ 48 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.