ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:42 PM

అదనపు భత్యానికి సంబంధించిన దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు  అసెంబ్లీల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధ్వని వ్యవస్థ, సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా సీట్లు ఏర్పాటు


అమరావతి: వెలగపూడిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యుల అదనపు భత్యానికి సంబంధించిన దస్త్రంపై సీఎం సంతకం చేశారు. క్వార్టర్స్‌ లేనందున సభ్యులకు అదనంగా రూ.50వేలు అదనపు భత్యం ఇవ్వనున్నారు.కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్‌ చక్రపాణి, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌, రాష్ట్ర మంత్రులు, శ్రీమతి పరిటాల సునీత, చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, ఉన్నత స్థాయి అధికారులకు తదితరులు పాల్గొన్నారు. సచివాల ఆవరణలో రెండు ఎకరాల స్థలంలో అసెంబ్లీ భవనం నిర్మించారు. సభాపతి, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. సభలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధ్వని వ్యవస్థ, సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా సీట్లు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com