న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా వేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యుల ఆందోలనల నడుమ సభ సజావుగా జరిగే పరిస్థితి లేకపోవడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రిటైర్ అవుతున్న ఎంపీలకు రాజ్యసభ కృతజ్ఞతలు తెలిపింది. సభ్యుల సేవలను కొనియాడింది. మహిళా ఎంపీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో విశ్రాంతి లేదని ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు.