ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ నుంచి 60 మంది సభ్యులు రిటైర్‌ అవుతున్నారు : వెంకయ్యనాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 11:40 AM

న్యూఢిల్లి : రాజ్యసభనుంచి 60 మంది సభ్యులు ఏప్రిల్‌ నెలలో రిటైర్‌ కానున్నారని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు చెప్పారు. రాజ్యసభ సమావేశమైన తరువాత ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నలుగురు నామినేటెడ్‌ సభ్యులతో సహా 60 మంది సభ్యులు రిటైర్‌ అవుతున్నారన్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రక్రియ సాగుతుంటుందని, కొత్త సభ్యులు కొత్త ఆలోచనలతో, కొత్త దృక్పథంతో సభకు వస్తారని, సభ నిరంతరం కొనసాగుతుంటుందని అన్నారు. రిటైరవుతున్న వారిలో డిప్యూటీ ఛైర్మన్‌ పిజె కురియన్‌, కె రహ్మాన్‌ ఖాన్‌ తదితరులున్నారని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com