న్యూఢిల్లి : రాజ్యసభనుంచి 60 మంది సభ్యులు ఏప్రిల్ నెలలో రిటైర్ కానున్నారని ఛైర్మన్ వెంకయ్యనాయుడు చెప్పారు. రాజ్యసభ సమావేశమైన తరువాత ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నలుగురు నామినేటెడ్ సభ్యులతో సహా 60 మంది సభ్యులు రిటైర్ అవుతున్నారన్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రక్రియ సాగుతుంటుందని, కొత్త సభ్యులు కొత్త ఆలోచనలతో, కొత్త దృక్పథంతో సభకు వస్తారని, సభ నిరంతరం కొనసాగుతుంటుందని అన్నారు. రిటైరవుతున్న వారిలో డిప్యూటీ ఛైర్మన్ పిజె కురియన్, కె రహ్మాన్ ఖాన్ తదితరులున్నారని ఆయన చెప్పారు.