న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 2022లోపు ప్రతి ఒక పౌరుడికి స్వంత ఇంటిని కల్పిస్తామని కేంద్ర హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములను వాడేందుకు తమ వద్ద ఆరు రకాల ఆప్షన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేటు భూములను కూడా వాడేందుకు తమ దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నట్లు మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 37 లక్షల 45 వేల 862 ఇండ్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే బెనిఫిషరీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఆ అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించినట్లు మంత్రి హర్దీప్ తెలిపారు. రుణాల అంశాలను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు.