న్యూఢిల్లీ : పార్లమెంటు ఆవరణలో తెలుగుదేశం ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీకి న్యాయం చేయాలంటూ తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ వినూత్నంగా నారదుడి వేషంలో తన నిరసనను తెలిపారు.