మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపు తిరుగుతోంది. మంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరైన కైలాష్ పాటిల్ శిబిరం నుంచి పారిపోయారు. పలువురు ఎమ్మెల్యేలను కార్లలో సూరత్కు తరలిస్తున్నారని తెలిసింది.దీంతో వెంటనే తిరిగి రావాలని నిర్ణయించుకున్నా వెంటనే వారి నుంచి తప్పించుకుని చాలా దూరం నడిచి సీఎం కార్యాలయానికి చేరుకున్నా అని అయన తెలిపారు.ఆయన కంటే ముందు మరో ఎమ్మెల్యే నితిన్ ధేష్ముక్ కూడా షిండేపై తీవ్ర ఆరోపణలు చేశారు.