నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ శుక్రవారం నియమితులయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆయన నియామకాన్ని ప్రకటించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం జూన్ 30, 2022తో ముగుస్తుంది. ఆ తర్వాత అయ్యర్ బాధ్యతలు స్వీకరిస్తారు.