పెదకాకానిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతవరపాడు నుంచి విజయవాడకు బైక్ పై భార్యాభర్తలు, ఒక పాప, బాబు బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి 10గంటలకు పెదకాకాని వద్ద హైవే పై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో బైక్ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, పాప మంగళగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా బాబు గాయాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.