పట్టాదారు పాసు పుస్తకం ఎన్నిసార్లు తిరిగినా అధికారులు కనికరించడం లేదని ఓ రైతు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలోని సత్యసాయి జిల్లా బుక్కపట్నం ఎమ్మార్వో ఆఫీసు వద్ద భాస్కర్ నాయక్ అనే రైతు పెట్రోల్ పోసుకుని శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకుని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐదేళ్లుగా పట్టాదారు పాసు పుస్తకం కోసం తిరుగుతున్నట్లు బాధితుడు వాపోయాడు.