అప్పులు తెలుగు రాష్ట్రాలను వెంటాడనున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ(ఎస్డీఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్(డబ్ల్యూఎంఏ), ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు దేశంలో అనేక రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందిస్తున్న ఉచిత పథకాలు కూడా అప్పులు పెరిగేందుకు కారణమవుతున్నాయి. కాగా, అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ(ఎస్డీఎఫ్), వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్(డబ్ల్యూఎంఏ), ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అత్యధిక రోజులు అప్పు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం గమనార్హం. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే.
ఇదిలావుంటే ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో మణిపూర్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలు ఎస్ డీఎఫ్, 14 రాష్ట్రాలు వేస్ అండ్ మీన్స్, 9 రాష్ట్రాలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. అస్సాం, బీహార్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వీటిలో దేన్నీ ఉపయోగించుకోకపోవడం గమనార్హం. ఇక మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్ డీఎఫ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 305 రోజులపాటు స్పషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 283 రోజులు వేస్ అండ్ మీన్స్(డబ్ల్యూఎంఏ) సంస్థ తాజాగా విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఈ విధంగా చేయలేదు. ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు.