ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్గర్‌లో మనిషి వేలు.. యువతికి షాక్

international |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 11:38 AM

హోటల్స్ లో ఫుడ్ తినే ముందు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ఈ ఘటన హెచ్చరిస్తుంది. ఓ మహిళ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బర్గర్ లో మనిషి వేలు బయటపడింది. దీంతో ఆ మహిళ ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన దక్షిణ అమెరికాలోని బొలీవియాలో చోటు చేసుకుంది. బొలీవియాలోని శాంటా క్రజ్‌లోని రెస్టారెంట్ లో ఒక మహిళ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ బర్గర్ ను తినడానికి ఆ మహిళ ప్రయత్నిస్తున్న సమయంలో అందులో మనిషి వేలి బయపడింది. దీంతో రెస్టారెంట్ నిర్లక్ష్యానికి గుర్తు అంటూ వేలు ఉన్న బర్గర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సదరు మహిళ. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం ఈ విషయంపై తీవ్ర వివాదం నెలకొంది. రెస్టారెంట్ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై వినియోగదారుల రక్షణ శాఖ సహాయ మంత్రి జార్జ్ సిల్వా స్పందిస్తూ ఈ ఘటనకు భాద్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com