చిత్తూరు: ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 36 లక్షలు విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిసిఎస్ సిఐ రమేష్ తెలియజేశారు. శనివారం స్థానిక ఓల్డ్ డి పి ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ లో బైక్ దొంగతనాలు చేసే విధానానికి ప్రేరేపితమై బైక్ దొంగతనానికి పాల్పడుతున్నా బంగారుపాలెం మండలానికి చెందిన తోటరాజేష్, (23) యాదమరి మండలానికి చెందిన ఈశ్వర్ (20) అనే ముద్దాయిలను అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.