కాబూల్ విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. ఎయిర్ పోర్టు అన్ని గేట్లను ముట్టడించిన అప్గానీలు తమను రక్షించాలంటూ విదేశీ బలగాలను వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉదయం కాబూల్ ఎయిర్ పోర్ట్ పశ్చిమ గేటు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో ఓ అప్ఘానీ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపింది ఎవరన్నది ఇప్పటి వరకు తెలియదు. విదేశీ బలగాలకు సమీపంలో ఈ కాల్పులు జరిగాయని జర్మనీ సైన్యం ప్రకటిచింది. కాల్పులు జరిపింది గుర్తు తెలియని వ్యక్తులని ట్వీట్లో తెలిపింది.