కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు నిలవాలంటే లాక్ డౌన్ పెట్టాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని.. కరోనా మృతుల బంధువుల ఆర్తనాదాలు సీఎంకు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన సలహాలు తీసుకోకుండా తమపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు.