ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేలుడు ఘటనపై సీఎం, గవర్నర్ దిగ్భ్రాంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 08, 2021, 03:14 PM

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పల్లె శివారులో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్ ఆదేశించారు. ఘటనకు కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ అన్బునారాజన్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com