కరోనా సోకిందని కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలోని కావలిలో చోటుచేసుకుంది. కావలికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యకు కరోనా సోకిందని.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో రెండు చేతులను నరికేశాడు. అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.