రాజంపేటలో నారా లోకేష్ యువత, విద్యార్థి, మొదటిసారి ఓటు నమోదు చేసుకున్న వారితో ముఖాముఖి సభ నిర్వహించనున్నారని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిట్వేలి మండల కార్యదర్శి కేకే చౌదరి తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగాన జరిగే ముఖాముఖి కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ విద్యార్థి, యువత పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.