గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని పదవ వార్డులో గురు స్వామి అనే వృద్ధుడు వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. శుక్రవారం తన పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన గురుస్వామి వడదెబ్బకు గురయ్యాడు. శనివారం ఉదయం గురుస్వామి వడదెబ్బతో మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గురుస్వామి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.