జగన్ మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై శుక్రవారం రాత్రి రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట లక్షింగారి పల్లి అరుంధతి వాడ నందు సుమారు 100 కుటుంబాలు వైసిపి లో చేరాయి. శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి ధ్వజారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు.