రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి సమక్షంలో మైనార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ బాబా సాహెబ్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలు టిడిపిలో చేరారు. శనివారం రైల్వే కోడూరు టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సయ్యద్ అబ్దుల్ రహీం, ఓబులవారిపల్లె మండల మైనార్టీ నాయకుడు జమీర్, అక్బర్ బాషా, కరిముల్లా, సలీం, తాజుద్దీన్, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.