ఒంటిమిట్ట మండలం కడప చెన్నై ప్రధాన రహదారిపై గల చెర్లోపల్లి వద్ద స్కార్పియో అదుపుతప్పి ప్రమాదానికి గురైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం గాంధీనగర్ కు చెందిన బసవరావు కుటుంబ సభ్యులలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు. ఒంటిమిట్ట ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.