ఎండల్లో బ్యాంకుకు వస్తున్న వృద్ధులు, దివ్యాంగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరారు. సాంకేతిక సమస్యల కారణంగా తమకు పింఛన్ ఇవ్వలేదని వృద్ధులు పలువురు ఫిర్యాదు చేయడంతో ఆయన శుక్రవారం ప్రొద్దుటూరుస్థానిక ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లారు. రోడ్డుపైన ఉన్న వృద్ధులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.