ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు భార్యలుంటే రూ. 2 లక్షలు.. కాంగ్రెస్ అభ్యర్థి హామీతో అవాక్కైన జనం

national |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 10:11 PM

ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు అమలుసాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇద్దరు భార్యలకు పథకాన్ని ప్రకటించి విస్మయానికి గురిచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. కేంద్ర మాజీ మంత్రి, రత్లాం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కాంతిలాల్ బహురియా గురువారం సైలనాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఈ పథకం కింద ఇచ్చే రూ.లక్షను ఇద్దరు భార్యలుంటే ఇరువురికీ వర్తింపజేస్తామని వెల్లడించారు.


‘ప్రతి మహిళ ఖాతాలో ఏటా రూ.లక్ష వేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం.. ఇద్దరు భార్యలు ఉంటే చెరో లక్ష చొప్పున రూ.2 లక్షలు అందజేస్తాం’ అని కాంతిలాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కాంతిలాల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అధికార బీజేపీ.. ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా భూరియా కాంతిలాల్ షేర్ చేసి, ఈసీకి ట్యాగ్ చేశారు. కాంతిలాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు.


మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంచుకోట అయిన రత్లాం నుంచి ఐదుసార్లు గెలిచిన కాంతిలాల్ బహురియా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com