వాషింగ్టన్: చైనా తన ఉకింపు చర్యలను కట్టిపెట్టాలని యూఎష్ ప్రభుత్వం తెలిపింది. తైవాన్ వాయు రక్షణ గుర్తింపు జోన్పై చైనా తన విహంగాలను ఎగురవేసి తైవాన్ను ఉకించేందుకు ప్రయత్నించడంతో యూఎస్ స్పందించింది. ఇరుగుపొరుగు దేశాలపై చైనా తన బెదిరింపు చర్యలను నిలిపివేయాలని అంతేకాకుండా తైవాన్పై తీసుకువస్తున్న మిలటరీ, డిప్లమాటిక్, ఆర్థిక ఒత్తిల్లను కూడా ఆపివేయాలని బీజింగ్ ప్రభుత్వానికి తెలిపింది. అయితే వాషింగ్టన్ తన స్నేహితులకు అండగా నిలుస్తుందని, శ్రేయస్సు కోరేవారితో జతకట్టేందుకు వెనుకాడనని యూఎస్ శనివారం ప్రకటించింది. జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ రోజులకే చైనా తన బాంబర్ విమానాలను ఎగురవేసింది. దాదాపు 13 చైనా జెట్ విమానాలు తైవాన్ వాయు భాగంలోకి అనుమతి లేకుండా చొరబడటంతో తైవాన్ వాయుసేన ఎంతో ఒత్తిడికి గురైందని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. దాంతో యూఎస్ వెంటనే స్పందించి బీజింగ్ తన చర్చలను కట్టిపెట్టాలని, ఇరుగుపొరుగు దేశాలను బెదిరించడం ఆపివేయాలని చెప్పింది. తన స్నేహితుల జోలికి వస్తే తాను ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడనని, ఎటువంటి కారణాలు లేకుండా సోదర దేశాలను బెదిరించడం, భయపెట్టడం మంచిది కాదని యూఎస్ పేర్కొంది.