దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు, కోవిడ్-19 మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 2.46 లక్షల మందికి వైరస్ సోకగా.. 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత 25 రోజులుగా కరోనా కారణంగా ప్రతి ఐదు రోజులకు 1,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో అధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటై మహారాష్ట్ర కోవిడ్ మరణాల్లో జర్మనీ (9,069), కెనడా (8,811) దేశాల కంటే ముందు వరుసలో ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తొలిసారి వెలుగుచూసిన చైనాలో కోవిడ్-19 మరణాలు (4,641) మహారాష్ట్రలో సగం ఉన్నాయి.