దాదాపు రెండు దశాబ్దాలుగా ఏపీలో కాపు ఉద్యమాన్ని నడిపిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యర్ధుల ఆరోపణలపై ఆవేదన చెందుతున్నట్లు తాజాగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో కాపు ఉద్యమం తీరు, ప్రస్తుతం తన మౌనానికి గల కారణాలు, పరిస్ధితుల ప్రభావం, ప్రత్యర్ధుల విమర్శలపై చాలా విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమం నడిపిన ముద్రగడ.. జగన్ అధికారం చేపట్టగానే మౌనంగా ఉన్నట్లు ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శల కారణంగానే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.