తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణమైందని, ఉత్తర ఇంటీరియర్ ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉన్నదని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.