రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్నారు. ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో హెచ్ఓడిఎస్ టవర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్మాణపు పనులను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.