ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ ల్యాండ్టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ పచ్చి అబద్దాలకోర్లుగా విషప్రచారం చేస్తున్నారని, దానిపై ఏమాత్రం అవగాహన లేకుండా మోసగాళ్లలా మాట్లాడుతున్నారన్నారు. ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హక్కుదారులకు కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారని.. ఒరిజినల్ ప్రభుత్వం దగ్గరే ఉంటాయనేది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ప్రచారం చేస్తున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, ప్రభుత్వంపై నిందలేస్తూ తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనేది తెలుగుదేశం, దాని అనుబంధ పార్టీలతో పాటు వారికి వత్తాసుపలికే పచ్చ మీడియా తాపత్రయమన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తోన్న వాళ్లను క్రిమినల్స్తో పోల్చడం తప్పేంకాదన్నారు. లేనిపోని విషయాలపై ప్రజలకు తప్పుడు సమాచారం అందించి గందరగోళంలోకి నెట్టేవారిని క్రిమినల్స్గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు.