జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని అనంతపురం జిల్లా కోర్టుకు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు కోర్టుకు తరలించారు. రెండ్రోజులపాటు జేసి ప్రభాకర్ రెడ్డి జేసి అస్మిత్ రెడ్డిని పోలీసులు విచారించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలను పోలీసులు 66 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాహనాలు అమ్మిన వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు అని జెసి అన్నారు. తాను కొనుగోలు చేసినవి మాత్రమే తనకు సంబంధించినవి అని అన్నారు.