మోడీ కంటే సీనియర్ నని చంద్రబాబు ప్రగల్పాలు పలికారని ఆంధ్రప్రదేశ్ సమాచార, రవణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. జరిగిన అక్రమాలపై కూలంకషంగా చర్చకు సిద్ధం అని అయన తెలిపారు. మీడియా సమక్షంలో ఆధారాలతో చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. జేసీ ట్రావెల్స్ అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయి అని అయన తెలిపారు. అక్రమ కేసులు పెడుతున్నామని ఎందుకు ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం టీడీపీ నేతలు దిగజారారు అని అయన అన్నారు. బిఎస్3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి డబ్బులకోసం ఆశపడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలను జేసీ బ్రదర్స్ ఉల్లంఘించారు అని పేర్ని నాని అన్నారు.