ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో కరోనా మృతులు 42 వేలు: చైనా ప్రజలు

international |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 01:57 PM

కరోనా వైరస్ కారణంగా చైనా మొత్తం మీద కేవలం 3300 మంది మాత్రమే మరణించారని చైనా ప్రభుత్వం చెబుతూ వస్తున్నా లెక్కల్లో ఏ మాత్రం వాస్తవం ఉందన్న సంగతి అంతుబట్టకుండా ఉంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుల గురించి సమగ్రంగా దర్యాప్తు జరగలేదని, లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే మరణించారని చెబుతున్నారు. ఒక్క నెలలోనే 28 వేల మృతదేహాలను దహనం చేశారనే వార్తలు వినిపించాయి. ప్రపంచమంతటినీ వణికిస్తున్న కరోనా వైరస్ సంక్రమణ చైనాలోని ఉహాన్ లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఉహాన్ వాసులు తమ నగరంలోనే ఏకంగా 42,000 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారని పేర్కొనడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com