ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్‌డౌన్‌ను పొడిగించేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 02:00 PM

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో, ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం మరిన్ని రోజులు పొడిగిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ సందర్భంగా కాబినేట్ సెక్రటరీ రాజీవ్ గౌబా మాట్లాడుతూ ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తుందని వస్తున్నవి పుకార్లు మాత్రమేనని, ఆ వార్తలు నిరాధారమైనవని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com