కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో, ప్రస్తుతం విధించిన లాక్డౌన్ను కేంద్రం మరిన్ని రోజులు పొడిగిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ సందర్భంగా కాబినేట్ సెక్రటరీ రాజీవ్ గౌబా మాట్లాడుతూ ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ను మరిన్ని రోజులు పొడిగిస్తుందని వస్తున్నవి పుకార్లు మాత్రమేనని, ఆ వార్తలు నిరాధారమైనవని తెలిపారు.