ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాల ప్యాకెట్ కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన విషాదం

national |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2020, 01:50 PM

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా నగరంలో లాల్ స్వామి అనే 32 ఏళ్ల వ్యక్తి లాక్ డౌన్ సందర్భంగా పాల ప్యాకెట్ కోసం వీధుల్లోకి వచ్చి పోలీసుల లాఠీదెబ్బలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హౌరా నగరానికి చెందిన లాల్ స్వామి పాల ప్యాకెట్ కొనేందుకు వీధుల్లోకి వచ్చారు. వీధుల్లో పహరా కాస్తున్న పోలీసులు లాల్ స్వామిని లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన లాల్ స్వామిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారు. కాగా పోలీసుల లాఠీ దెబ్బల వల్లనే లాల్ స్వామి మరణించాడని మృతుడి కుటుంబీకులు చెపుతుండగా, పోలీసులు మాత్రం గుండెపోటుతోనే మరణించాడని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com