రక్షణ రంగంలో భారత్ కు అమెరికా అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. మోడీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ రక్షణ రంగంలో 3 వేల మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపారు. రక్షణ రంగంలో భారత్ అభేద్యంగా మారుతుందన్నారు.భారతీయుల ఆదరాభిమానాలు వెలకట్టలేనివని ట్రంప్ చెప్పారు. మొతేరా స్టేడియంలో తనకు లభించిన అపూర్వ ఆదరణ తనకు ఎప్పటికీ గుర్తుంటుందని అన్నరు.