ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి ఇది గొప్ప విజయం : సీఎం యెడియూరప్ప

national |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 07:23 PM

ఉప ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాలకు బీజేపీ 12 స్థానాల్లో గెలవడం తమ పార్టీకి గొప్ప విజయమని కర్ణాటక సీఎం యెడియూరప్ప స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షం తమపై ఆరోపణలు చేయడం మానాలి. ప్రభుత్వానికి సహకరించాలి. రాబోయే మూడున్నరేండ్లు కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని యెడియూరప్ప తేల్చిచెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం హామీనిచ్చారు. వీరికి ప్రభుత్వంలో ఉన్నత పదవులిచ్చే అంశంపై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడుతానని సీఎం యెడియూరప్ప పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com