ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 04:29 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై నియమాలను కూడా సిద్ధం చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా మంది హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ జరిగిన విచారణ అప్పీల్‌ను తిరస్కరించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2018 ఆగస్టులో పదవీకాలం పూర్తయిన సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మునిసిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com